Tuesday, 12 July 2016

అది ఆయన ప్రత్యేకత

హాస్యబ్రహ్మ శ్రీ శంకరనారాయణ గారు ఎంత హాస్య ప్రియులో...అంతగంభీరంగావుంటారు.కొద్దికాలంలోనే మా మద్య మంచి స్నేహం ఏర్పడింది.ఆయన మట్లాడిన ప్రతి మాటలొ హాస్యంతొ పాటు విజ్నానం వుంటుంది.వేదికపై కూర్చొని చలోక్తులు విసురుతూ సభికులవైపు చూసే చూపు బాగ నవ్వుపుట్టిస్తుంది.అది ఆయన ప్రత్యేకత.


Monday, 11 July 2016

                                          వనప్రతిష్టాపనా మహోత్సవం



 శ్లొ//అశ్వథ మేకం పిచుమంద మేకం న్యగ్రోధమేకం దశతింత్రీణీకం/

   కపిత్థ బిల్వామలక త్రయంచ నవామ్రవాపి నరకం నయాతి//


అశ్వత్థ--రావి
పిచుమంద--వేప (1)
న్యగ్రోధ--మ ఱ్రి(1)
తింత్రిణీ--చింతచెట్లు (10)
కపిథం--వెలుగ(3)
బిల్వం--మారేడు(3)
ఆమలకం--ఉసిరి(3)
ఆమ్ర--మామిడి(9)
ఈ విధముగా చెట్లు నాటి పోషీంచి పెద్దచేసితే నరకం "నరకం నయాతి" అతనికి నరకం ఉండదు అని మన సనాతన సాంప్రదాయల విశ్వాసం

"వాపీ కూప తటకాని వాజపేయ శతానిచ, గజదాన  సహస్రాణి ఆరామన్యశతాంశకం"

బావులు త్రవ్వడం,చెరువులు వేయించడం,వాజపేయంలాంటి మహాక్రతువులు నిర్వహించడం,వెయ్యి ఏనుగులు  దానంచేసినదానికన్న  వనములు పెంచడం,చెట్లు నాటి పోషించడంవల్ల  వెయ్యంతల ఫలితం.

         

   
       
     సామాన్యుడు                                             ప్రభువు / అధికారులు                                                       రాజులు / ప్రజాప్రతినిధులు
 
 
అశ్వత్థ--రావి (1)                                    (100)                                                                   (1000)
పిచుమంద--వేప (1)                              (100)                                                                   (1000)
న్యగ్రోధ--మ ఱ్రి(1)                                  (100)                                                                    (1000)


తింత్రిణీ--చింతచెట్లు (10)                     (1000)                                                                    (10,000)
కపిథం--వెలుగ(3)                               (300)                                                                     (3000)
బిల్వం--మారేడు(3)                             (300)                                                                     (3000)

ఆమలకం--ఉసిరి(3)                         (300)                                                                         (3000)

ఆమ్ర--మామిడి(9)                           (900)                                                                        (9000)

ప్రజాప్రతినిధులయిన,  గ్రామాదీశులు,  మండాలాధీశులు,   య.యల్.ఎ,   యంపీ ,    సర్వేసర్వత్ర  పై  సూచించిన సంఖ్యలో చెట్లు నాటి పోషించితే  దేశంలొ ఫలవంతమైన వృక్షసంపద  పెరిగి మహారణ్యములు ఏర్పడి అడుగడుగున నైమిశారణ్యములు ఏర్పడును.










                 
             

                              వనముల ప్రత్యేకత
శ్లో// పురా పుణ్యైకమతయహ్  పుణ్యక్షేత్రే  చతుష్పధే/
     జంత్వా తపన శాంత్యర్థం సుఖార్థంతు తపస్వినాం/
    పక్షిణాం సుఖవాసార్థం తపనార్థం మునీశ్వరా/
చక్రుర్వరాని స్రర్వత్ర పుణ్యేభారతవర్షకే//

పూర్వమందు  కొందఱు  పుణాత్ములు  జంతువులకు  ఎండవలన  కలిగెడు తాపము   పోవుట కొరుకును, మునీశ్వరులకు  సుఖము     కలలుగుకొఱుకును, పక్షులు   సుఖించు    కొ ఱకును   జీవుంచుటకును  ఫుణ్యక్షేత్రములయందును     నాలుగుమార్గములు    కూడిన ప్రదేశములయందును మఱియు    భరతఖండములో   ఫుణ్యప్రదేశము ఎచ్చట ఎచ్చట వుండునో అట్టి సమస్త ప్రదేశములయందును వనముల నేర్పరచిరి.

పర్యావరణ పరిరక్షణ, వాతావరణకాలుష్యం భూజలపరిరక్షణ,బాగుగ వర్షములుకురుయు కుఱుయుటకు మన పూర్వులు చేసినదానికన్న ఎక్కువగా చేయవలసియున్నది.


 (బ్రా)      శ్లొ/కదంభాశ్వథ పలాశ ఖదిరాశ్చ వైకంకతః/
              బ్రా  హ్మణానాం ప్రశస్తాస్స్యుః వృక్షాబల సుఖప్రదాః//
తా// కడిమి, రావి, మోదుగ, చండ్రపుల్ల (పుల్లవెలుగ),వెలుగ యి చెట్లు ప్రశస్తమయినివగను బలమును సుఖమును నిచ్చునవిగను చెప్పబడినవ


          శ్లో// న్యగ్ర్యోధ భిల్వ ఖదిరాః  క్షత్రియస్య సుఖప్రదాః/ (క్ష)
                మధూకౌదుంబరాశ్చైవ ఖదిరాశ్చార్హ్జున స్తరుః /.(వై)
                  వైశ్యస్యశుభదా, ప్రోక్తాః యశోబలసుఖప్రదాః//
తా//        మఱ్రి,     మారేడు,చండ్ర  యీ వృక్షములు రాజులకు ఉత్తమమైనవి.   తా//ఇప్ప,మేడి మద్ది యీ వృక్షములు వైశ్యులకు, శుభములునొసంగు                ననియు కీర్తీనిచ్చుననియు,సుఖము నిచ్చుననవిగను జెప్పబడినవి.  

      శ్లో//     ఔదుంబర శ్శమీచైవ ఖదిర శూద్రసమ్మతం
        //తా// మేడి,జమ్మి,చండ్ర యీ చెట్లు ఎవ్వరైన పెట్టవచ్చును.
                              వనముల  

ప్రత్యేకత
శ్లో// పురా పుణ్యైకమతయహ్  పుణ్యక్షేత్రే  చతుష్పధే/
     జంత్వా తపన శాంత్యర్థం సుఖార్థంతు తపస్వినాం/
    పక్షిణాం సుఖవాసార్థం తపనార్థం మునీశ్వరా/
చక్రుర్వరాని స్రర్వత్ర పుణ్యేభారతవర్షకే//

పూర్వమందు  కొందఱు  పుణాత్ములు  జంతువులకు  ఎండవలన  కలిగెడు తాపము   పోవుట కొరుకును, మునీశ్వరులకు  సుఖము     కలలుగుకొఱుకును, పక్షులు   సుఖించు    కొ ఱకును   జీవుంచుటకును  ఫుణ్యక్షేత్రములయందును     నాలుగుమార్గములు    కూడిన ప్రదేశములయందును మఱియు    భరతఖండములో   ఫుణ్యప్రదేశము ఎచ్చట ఎచ్చట వుండునో అట్టి సమస్త ప్రదేశములయందును వనముల నేర్పరచిరి.

పర్యావరణ పరిరక్షణ, వాతావరణకాలుష్యం భూజలపరిరక్షణ,బాగుగ వర్షములుకురుయు కుఱుయుటకు మన పూర్వులు చేసినదానికన్న ఎక్కువగా చేయవలసియున్నది.


 (బ్రా)      శ్లొ/కదంభాశ్వథ పలాశ ఖదిరాశ్చ వైకంకతః/
              బ్రా  హ్మణానాం ప్రశస్తాస్స్యుః వృక్షాబల సుఖప్రదాః//
తా// కడిమి, రావి, మోదుగ, చండ్రపుల్ల (పుల్లవెలుగ),వెలుగ యి చెట్లు ప్రశస్తమయినివగను బలమును సుఖమును నిచ్చునవిగను చెప్పబడినవ


          శ్లో// న్యగ్ర్యోధ భిల్వ ఖదిరాః  క్షత్రియస్య సుఖప్రదాః/ (క్ష)
                మధూకౌదుంబరాశ్చైవ ఖదిరాశ్చార్హ్జున స్తరుః /.(వై)
                  వైశ్యస్యశుభదా, ప్రోక్తాః యశోబలసుఖప్రదాః//
తా//        మఱ్రి,     మారేడు,చండ్ర  యీ వృక్షములు రాజులకు ఉత్తమమైనవి.   తా//ఇప్ప,మేడి మద్ది యీ వృక్షములు వైశ్యులకు, శుభములునొసంగు                ననియు కీర్తీనిచ్చుననియు,సుఖము నిచ్చుననవిగను జెప్పబడినవి.  

      శ్లో//     ఔదుంబర శ్శమీచైవ ఖదిర శూద్రసమ్మతం
        //తా// మేడి,జమ్మి,చండ్ర యీ చెట్లు ఎవ్వరైన పెట్టవచ్చును.

Tuesday, 5 July 2016

reply letter.

నిజమే...విస్సన్న చెప్పిందే వేదం అనికుడా నా వితండవాదము కాదు.అత్యంత శత్రువు....అత్యంత మిత్రుని పేరు పదె పదె పరువురెదుట  ఉచ్చరించడంలో ప్రమాదములు ఏర్పడ అవకాశములు కలవు.కాని భార్య పేరు,జ్యెష్ట పుత్రుని పేరు ఉచ్చరించడంలొ వున్నప్రమాదం ఏమిటొ ఇప్పటికి అర్థం కాలేదు,అందులో నిఘూడం బొదపడలేదు.
 మన ప్రచ్చన్న యుద్దానికి ఇక తెర దించుదాం.అంతా శుభం....

reply for parthasaradhi ambhalam "wife Name"




 మాపై   మీరు  చాల ఆగ్రహంతోవున్నారు.నా స్వంతాభ్విప్రాయమెదో చేప్పినట్టుగా  స్త్రీలను,అందులొ భార్యలను కించపరిచినట్టుగా నాపై ఒక అభియోగం. వేదాలు,పురణాలు,ఇతిహాసాలు ఎన్నివున్నా అనుభవైకసత్యాలు అయిన మరెన్నొ సుభాషితాలు మనకున్నాయి.ఆ సుభాషితాల సంగ్రహమే తప్ప ఇది నస్వంతపైత్యం కాదు.

మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా వుండే జంటలు ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకొన్నప్పటికి "మీరు" బదులుగా "నీవు"అను ఏకవచనం ప్రయొగించ కుండ    భర్తలు  ఎంతమంది ఉంటారు..?.

  తన సంతనాన్ని "వాడు..వీడు" అనకుండ "మీరూ....మీరూ,," సంభొదించే తండ్రులు ఎనందరు..?,
  పదముకన్న భావం మిన్నగా,ప్రేమగా వుండాలి.అన్యొన్యతకు,అనురాగానికి,సంసారానికీ
ఈ పదాలు ఏవి అడ్దురావు
వ్యక్తి శ్రేయస్సు ద్రుష్ట్యా చెప్పినవె తప్ప సంఘాన్ని కించపరచేవి కావు.
                    M.v.sharma,astro
                   



Monday, 4 July 2016

do not tell

Do not tell your's wife name ?..

Because, decreasing in span  of life, not only wife,
even first child's name aslo.. it cuts the life ,besides family
yshassu,means {barkat} growth,health and wealth.tradational
people use to tells only  on ther words ,Gharvali,bada beta,
chota beta,like this.

don't reapeat again and again direct names of your utmost
friend and foe.

bhatya peru[name]

                                                       భార్యను పేరు పెట్టి పిలవరు ...ఎందుకని... ?

యఃశ్శస్సు కోరేవాడు, ఆయ్యుషుకొరేవాడు,తన కుటుంబ ఉన్నతిని కోరేవాడు,@ తనభార్య పేరును,@ తన పెద్దకొడుకు  (జ్యేష్ఠ సంతానం} పేరుని, @తన అత్యంత మిత్రుని, @ తన అత్యంత   శత్రువుని పేరుని సూటిగా ఉచ్చరించరాదు.అందుకే మనపూర్వులు,    ఏమే ..,ఓసేవ్,ఉన్నావా..?, ఏంచేస్తున్నావ్...?  ....      మా ఆమే...లేదా...మా ఆవిడా..రకరకాల సంభోదనలతో భార్యను పిలవడం అనవాయితి అయ్యింది.  భార్యలు  భర్తల పేర్లుతొ ఉచ్చరించిన  ఆయుక్షీణమే.


 తనకొడుకు   [జ్యేష్ట సంతానం]
                                         విషయంలో,మా పెద్దవాడండి.....మాపెద్దోడండి లేదా మాచిన్నొడండి...లేదా
                                                                                                                                              మా పెద్దది...మా చిన్నది
అంటు సంభొదంచడం రివాజు.ఇక్కడ కూడ   ఆయ్యుషు....యశ్శస్సు  ప్రధానమైనది.

ఎవ్వరితో అత్యంత సన్నిహితమైన,  శత్రుత్వమైన వారి పేర్లను పదే పదే ఉచ్చరించినచో అది ఇతరులకు తెలిసినచో ప్రమాదమున్నది కావున  రహస్స్యముగా ఉంచవలె,అందుకు గాన పిల్వరాదు.

Sunday, 3 July 2016



108 సంఖ్యకి ఎందుకంత ప్రాముఖ్యం?


అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ 108 అనే సంఖ్యకు వారు చాలా ప్రాముఖ్యత నిచ్చారు. దేవున్ని / దేవతలను మంత్ర పుష్పాలతో పూజిస్తూ 108 పవిత్ర పూసలు గల జపమాలను గణిస్తూ జపం చేసేవారు.

108 సంఖ్య యొక్క ప్రాముఖ్యతను భారతదేశంలో హిందువులే కాదు, బౌద్ధులు, జైనులు, సిక్కులువంటి వారందరూ గుర్తించారు. తనలోని దైవత్వాన్ని గ్రహించటానికి ఆత్మ 108 మెట్లు దాటాలని వీరి నమ్మకం. ఈ సంఖ్య భగవంతునికీ భక్తునికీ మధ్య అనుసంధాన కారకమని భారతీయుల నమ్మకం.

వేద ఋషులు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన గణనలో..
భూమికి, చంద్రునికి మధ్య దూరం, చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉందని.. భూమికి, సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉందని.. సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు అనీ నిర్థారించారు.

ఈ వేదగణన ఆధునిక సాంకేతిక విశ్వగణనలో లభించిన భూమికీ, చంద్రునికీ, చంద్రునికీ సూర్యునికీ ఉన్న దూరంతో దాదాపు సరిపోయింది.

ఆయుర్వేదం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలను గుర్తించింది. 108 అనే మర్మాల గొలుసులో 107 గ్రంధులు శరీరంలో ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. ఇవి జీవచైతన్యం మానవ శరీరంలో మిళితమయ్యే కేంద్ర స్థానాలు. ఈ మర్మస్థానాల ద్వారా ప్రాణశక్తి జీవిని చైతన్యపరుస్తుంది. భారతీయ యోధునికి పైన చెప్పిన మర్మస్థానాలు తెలిసే ఉంటాయి. అతడు యుద్ధం చేసే సమయంలో శత్రువును ఆ మర్మ స్థానాలపై దాడి చేసి సంహరిస్తాడు.

అలాగే పవిత్రమైన శ్రీ చక్రయంత్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి. వీటి మొత్తం 108.

జ్యోతిష్య శాస్త్రం ః మానవ ప్రవృత్తికి సంబంధంఇచి బ్రహ్మాండాన్ని 27 చంద్ర సూచికలైన నక్షత్రాలతో, ఒక్కో నక్షత్రం తిరిగి 4 పాదాలతో ఉంటుందని గుర్తించింది. ఇది 27 X 4 = 108 పాదాలయింది. అవే 108 ప్రాథమిక మానవ ప్రవృత్తులు. శిశు జనన సమయంలో చంద్రుడు ఏ పాదంలో ఉంటాడో, దాని ప్రభావం ఆ వ్యక్తి జీవితంలో, వృత్తిలో, ఆనందంలో, కుటుంబంలో, చివరకు మోక్షమార్గాలలోనూ ప్రతిఫలిస్తుంది.

- భారతీయ జ్యోతిష్యంలో 12 రాశులు, 9 గ్రహాలుంటాయి. 12 x 9 = 108.

- మానవుడు సగటున ప్రతిరోజు 21,600 సార్లు శ్వాస తీస్తాడు. అందులో 10,800 సూర్యాంశ, 10,800 చంద్రాంశ.. 108ని 00తో గుణిస్తే.. 10,800 వస్తుంది. దీనిని 2తో గుణిస్తే.. 21,600 వస్తుంది అని తంత్ర శాస్త్రం చెబుతుంది.

- భరతుడు - తన నాట్యశాస్త్రంలో చేతులు, కాళ్లు కలిపి చేసే నాట్యభంగిమల మొత్తం సంఖ్య 108గా గుర్తించాడు. వీనిని కరణములంటారు.

- 18 పురాణాలు, 108 ఉపనిషత్లుఉ, భగవద్గీతలో 18 అధ్యాయాలు, ఎన్నో ప్రముఖ సంస్కృత గ్రంథాలలో 108 శ్లోకాలు ఉంటాయి. లిహందువులు నిత్యమూ పూజ చేసే విధానంలో అష్టోత్తర పూజ, అష్టోత్తర శత నామావళి వంటివి ఉంటాయి. చాలామంది సిద్ధులు తమ తమ పేర్లకు ముందు 108గానీ, 1008గానీ ఉంచుకునే సాంప్రదాయం ఉంది.

- సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వీటికి శివ, శక్తి తత్వాలైన స్త్రీ, పురుష రూపాలుంటాయి. అనగా 54 X 2 = 108.

భారతీయ కాలగణన ప్రకారం బ్రహ్మకు ఒక రోజు అంటే 4 యుగాలు కలిసి 43,20,000 సంవత్సరాలు. ఇది 108 అనే సంఖ్యతో భాగించబడుతుంది.
సంఖ్యా శాస్త్రంలో 108ని 1+0+8=9గా రాస్తారు. ఒక సంఖ్యను 9తో గణించి వచ్చిన సంఖ్యను కూడగా తిరిగి 9 వస్తుంది.

అందుకే ఇంతటి వైశిష్ట్యం గల 108 సంఖ్య ఎంతో దివ్యమైనదని చాలామంది నమ్ముతుంటారు. అది సృష్టికర్తకు, సృష్టికి అనుసంధానం కలిగించేది. అందుకే మన రుషులు, పురాణాలు, వేదాలు, భారతీయ సంస్కృతి 108కి ఇంతటి పవిత్రత ఇస్తున్నది

SOMAVATI AMMAVVASYA

               సోమవతి అమావాస్య
శ్లో//అమావాస్యా యదాపార్థన్ సోమావారాన్వితాభవేత్/
    తదాపుణ్యతమహ్ కాలో దేవానామపిదుర్లభహ్//
   
@    ఆమా సోమవార వ్రతం,
@    అశ్వథ వృక్షం (రావి చెట్టు )నకు 108 ప్రదక్షిణలు చెయాలి
@     మౌన వ్రతం, గంగాస్నానం,విష్ణుపూజ
@     ఈరోజు ప్రత్యేకంగా ప్రత్తిని ముట్టడం,వత్తిని చెయడం నిషేద్దం.
@     సిం హ్మళ  దేశంలొ  సొమీదేవమ్మ అను చాకలి వనిత సొమవారం ప్రత్తిని ముట్టకుండ అనే వ్రతదీక్షతో మహాశక్తిషాలీనై కాంచిపురంలో ఓ బ్రాహ్మణ          
కన్యకు   వైధవ్యం  లేకుండచేస్తుంది.


 శ్లొ// అద్యమూలం తధా తూలం న స్పృశామి కదాచన/
తతోశ్వథ తరుం ప్రాప్య నదీతీర భవం శుభం/